కృష్ణా న‌దీజలాల వాట‌పై స్ప‌ష్ట‌త ఇవ్వండి : కేంద్ర జ‌ల‌శ‌క్తికి కేసీఆర్ స‌ర్కార్ లేఖ‌

-

కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ‌కు తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం లేఖ రాసింది. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన న‌దీ జ‌లాల కేటాయింపు పై కేంద్ర జ‌ల‌శక్తి శాఖ‌కు తెలంగాణ రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రానికి న‌దీ జలాల కేటాయింపు పై ట్రైబ్యున‌ల్ కు నివేదించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం లేఖ‌లో కోరింది. న‌దీ జ‌లాల కేటాయింపుపై కొత్త ట్రైబ్యునల్ కు గానీ కృష్ణా న‌ది జలవివాదాల రెండో ట్రైబ్యునల్ కు గానీ సిఫారసు చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం లేఖ‌లో కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరింది.

telangana-logo

కృష్ణా న‌ది జ‌లాల్లో తెలంగాణ రాష్ట్ర వాట తెల్చాల‌ని కేంద్ర జ‌ల శక్తి శాఖ ను తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కోరింది. కాగ కృష్ణా న‌దీ జ‌లాల్లో తెలంగాణ వాట పై స్ప‌ష్టత ఇవ్వాల‌ని ఇప్ప‌టికే ప‌లు సార్లు.. కృష్ణా న‌ది యాజ‌మాన్య బోర్డుకు తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం లేఖ రాసింది. ఇప్పుడు తాజా గా తెలంగాణ రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ‌.. కేంద్ర జ‌ల శ‌క్తి మంత్రుత్వ శాఖకే లేఖ రాసింది.

Read more RELATED
Recommended to you

Latest news