దుర్గమ్మ ఫ్లై ఓవర్ ప్రమాదంపై క్లారిటీ…!

-

విజయవాడ కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్ నాణ్యతపై అనేక అనుమానాలు రావడంతో రోడ్లు, భవనాల శాఖ క్వాలిటీ కంట్రోల్ ఎస్ ఇ జాన్ మోషే క్లారిటీ ఇచ్చారు. నిన్న కనకదుర్గ ఫ్లై ఓవర్ నుంచి పెచ్చు ఊడి పడి ఒక కానిస్టేబుల్ కి స్వల్ప గాయాలయ్యాయని ఆయన తెలిపారు. నాణ్యతపై ఎటువంటి అనుమానాలు లేవు అని అన్నారు. దసరా ఉత్సవాలు ముగిసిన తర్వాత ఫ్లై ఓవర్ క్రింద ట్రాఫిక్ నిలిపేసి పూర్తిస్ధాయిలో తనిఖీ చేస్తాం అని పేర్కొన్నరు.

నిర్మాణంలో ఎటువంటి లోపాలు లేవు…ఫ్లై ఓవర్ పై వాహనాలు రాకపోకలు సాగిస్తున్న సమయంలో అదనపు కాంక్రీట్ పెచ్చుగా పడింది…అది వేస్ట్ కాంక్రీట్ అన్నారు. పూర్తిస్ధాయి నాణ్యతతోనే నిర్మాణం పూర్తి చేసాం అని చెప్పారు. ఫ్లై ఓవర్ దగ్గర బారికేడ్స్ ఏర్పాటు చేశాం అని పేర్కొన్నారు. అయిదు స్పాన్ ల లోడ్ టెస్ట్ కూడా నిర్వహించాం అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news