ఢిల్లీ ముఖ్యమంత్రి కి థాంక్స్ చెప్పిన తెలంగాణ ఎంపీ..!

-

ఇటీవల కురిసిన భారీ వర్షం హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తిన విషయం తెలిసిందే. భాగ్యనగర చరిత్రలోనే అత్యధిక వర్షపాతం నమోదైన నేపథ్యంలో హైదరాబాద్ నగరం వణికిపోయింది. ఇక భారీ వర్షం కారణంగా వచ్చిన వరదల తో జలదిగ్బంధంలో కి వెళ్ళిపోయింది భాగ్యనగరం. అధికారులు ఎన్ని ముమ్మర చర్యలు చేపట్టినప్పటికీ ఇప్పటికి నగరం వరదల నుంచి కోలుకోవడం లేదు. ఈ క్రమంలోనే వరద బాధితులకు తక్షణ సహాయం కింద తెలంగాణ ముఖ్యమంత్రి 550 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే.

అంతే కాకుండా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రస్తుతం వరదలు హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తుతున్న నేపథ్యంలో వారికి అండగా నిలబడేందుకు ముందుకు వస్తూ ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్ 15 కోట్ల ఆర్థిక సహాయం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై స్పందించిన పార్లమెంటు సభ్యుడు రంజిత్ రెడ్డి వరద బాధితుల కోసం కేజ్రీవాల్ 15 కోట్లు ఇవ్వడం ఎంతో గొప్ప విషయం అంటూ కృతజ్ఞతలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news