కడప జిల్లాలో వైసీపీ-టీడీపీ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ.. ఏం జ‌రిగిందంటే..?

-

కడప జిల్లాలో వైసీపీ-టీడీపీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 11 మంది గాయపడ్డారు. చక్రాయపాలెం మండలం కుమారకాల్వ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ చిన్న విషయం పెను వివాదమై ఇరు వర్గాల మధ్య ఒకరిపై ఒకరు రాళ్లు, కొడవళ్లతో దాడి చేసుకునేలా చేసింది.

ఈ ఘటనలో గాయపడిన 11 మందిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకొని అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు. అనంతరం ఇరువర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక వైసీపీ-టీడీపీ వర్గాల ఘర్షణ వెనక కారణాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news