ఏపీ రైతులకు సీఎం జగన్ శుభవార్త..పంట నష్టపరిహారంపై కీలక ప్రకటన

-

గోదావరి వరదలపై సీఎం జగన్ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌ ఏపీ రైతులకు తీపికబురు చెప్పారు. వరద తగ్గగానే పంట నష్టంపై అంచనాలు వేయాలని…. వరద తగ్గుముఖం పట్టిన వెంటనే 10 రోజుల్లో పంట, ఆస్తి నష్టాలపై అంచనాలు పూర్తిచేయాలని ఆదేశించారు. ఆ తర్వాత.. రైతులకు తగిన నష్ట పరిహారం చెల్లించాల్సిన అవసరం ఉందని ప్రకటన చేశారు.

అలాగే… 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళా దుంపలు, కేజీ ఉల్లిపాయలు, కేజీ పామాయిల్‌… ఈ రేషన్‌ అంతా ఉంది.. వదర బాధిత కుటుంబాలకు వచ్చే 48 గంటల్లో అందాలన్నారు. ముంపునకు గురైన ప్రతి గ్రామంలో పంపిణీని ముమ్మరం చేయాలి… కలెక్టర్లు, సీనియర్‌ అధికారులు దీన్ని సవాల్‌గా తీసుకోవాలని సూచనలు చేశారు.

గతంలో రెండు జిల్లాలకు ఇద్దరు కలెక్టర్లు మాత్రమే ఉండేవారు… ఇద్దరు జాయింట్‌కలెక్టర్లు మాత్రమే, ఇద్దరు ఎస్పీలు మాత్రమే ఉండేవారని పేర్కొన్నారు. కాకినాడతో కలుపుకుని ఆరుగురు కలెక్టర్లు, ఆరుగురు జేసీలు, ఆరుగురు ఎస్పీలు ఉన్నారన్నారు. నాణ్యమైన సేవలు అందించాలని.. పంపిణీని ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్‌.

 

Read more RELATED
Recommended to you

Latest news