మానవత్వాన్ని చాటుకున్న సీఎం వైఎస్ జగన్.. వీడియో వైరల్

-

విజయవాడ: అంబులెన్స్.. సౌండ్ వింటే చాలు అందరూ సైడ్ అవుతుంటారు. ఆంబులెన్స్ లో ఉన్న పేషెంటు పరిస్థితి ఎలా ఉంటుందోనని… కాస్త జాలి, దయ చూపించి చాలామంది అంబులెన్స్ కు దారి ఇస్తూ ఉంటారు. అలాగే ఈ మధ్య అధికారులు ప్రజా ప్రతినిధులు కూడా.. ఆంబులెన్స్ లకు… దారి ఇస్తూ… వార్తల్లో నిలుస్తున్నారు.

అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి… మంచి మనసును చాటుకున్నాడు. 108 అంబులెన్స్ కోసం తన కాన్వాయ్ ని సీఎం జగన్ పక్కకి జరిపించారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి తాడేపల్లి వెళు తుండగా ఎనికేపాడు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. 108 అంబులెన్స్ ను చూడగానే స్పందించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. వెంటనే ఆ 108 అంబులెన్స్ కు దారి ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఘటన కు సంభందించిన వీడియో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో ను చూసిన నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news