బ్రేకింగ్: వాక్సిన్ పై జగన్ కీలక వ్యాఖ్యలు

-

వాక్సిన్ విషయంలో అన్నీ తెలిసి కూడా కావాలని విమర్శలు చేస్తున్నారని సిఎం వైఎస్ జగన్ ఆరోపించారు. దేవుడు ఆశీర్వదిస్తే అందరికి ఉచితంగా వాక్సిన్ అందిస్తామని అన్నారు. కరోనా సమయంలో ఎవరిపైనో వేలు ఎత్తి చూపిస్తే సాధించేది ఏముంది అంటూ కూడా జగన్ ప్రశ్నించారు. దేశంలో ఇప్పుడు 172 కోట్ల వాక్సిన్ డోస్ లు కావాలని కాని ఇప్పుడు కేవలం ఇప్పుడు 7 కోట్లు మాత్రమే నెలకు ఉత్పత్తి అవుతున్నాయని అన్నారు.

వాక్సినేషన్ పెంచితేనే అందరికి హెడ్ ఇమ్యూనిటీ వస్తుందని అన్నారు. వాక్సిన్ కోసం గ్లోబల్ టెండర్ లు పిలిచామని జగన్ పేర్కొన్నారు. అన్నీ బాగా జరిగితే నా వల్ల లేకపోతే మీ వల్ల అని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. వాక్సిన్ ఏపీకి 7 కోట్లు అవసరం అయితే కేంద్రం కేవలం 77 లక్షలు మాత్రమే ఇచ్చిందని జగన్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news