ఎన్ని కుట్రలు, రాళ్లు వేసినా నా గుండె చెదరలేదు – సీఎం జగన్‌

-

తాను పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్ని కుట్రలు చేసినా నా గుండె చెదరలేదని ఏపీ సీఎం జగన్‌ వెల్లడించారు. ఎన్ని రాళ్లు వేసినా.. ఎన్ని నిందలు వేసినా భరించానని సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఓదార్పు యాత్రతో… వైసీపీ పార్టీ ఏపీలో బలంగా తయారైందని స్పష్టం చేశారు సీఎం జగన్. కాసేపటి క్రితమే.. ఇడుపులపాయ నుంచి.. వైసీపీ ప్లీనరీ ప్రాంగణానికి చేరుకున్నారు ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.

ఈ నేపథ్యంలోనే… సీఎం జగన్‌, విజయమ్మ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సభ స్థలిపై ఎక్కారు సీఎం జగన్‌. అనంతరం సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ… నాన్నా.. మిమ్మ‌ల్ని ఆరాధించే కోట్ల మంది చిరున‌వ్వుల్లో నిత్యం మీ రూపం క‌నిపిస్తూనే ఉంటుందని… ఇచ్చిన మాట, న‌మ్మిన సిద్ధాంతం కోసం ఆఖ‌రి శ్వాస వ‌ర‌కు క‌ట్టుబ‌డి జీవించిన మీ జీవిత‌మే నాకు స్ఫూర్తి. ప్ర‌జా సంక్షేమం కోసం మీరు చేసిన ఆలోచ‌న‌లు ఈ ప్ర‌భుత్వానికి మార్గ‌ద‌ర్శకమని పేర్కొన్నారు. ప్రతి పక్షాన్ని 23 ఎమ్మెల్యే సీట్లకు, 3 ఎంపీ సీట్లకు దేవుడు పరిమితం చేశాడని టీడీపీపై సెటైర్‌ వేశాడు సీఎం జగన్‌ మోహన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news