రేపే సీఎం జగన్‌ తిరుమల పర్యటన.. షెడ్యూల్‌ ఇదే

-

రేపు సీఎం జగన్ తిరుమలలో పర్యటించనున్నారు. ఈ పర్యటన లో భాగంగా… రేపు మధ్యహ్నం తిరుపతికి చేరుకోనున్నారు సీఎం జగన్. మధ్యాహ్నం 3 గంటలకు 25 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన చిన్న పిల్లల హస్పిటల్ ను ప్రారంభించనున్నారు సీఎం జగన్‌. అలాగే… సాయంత్రం 4 గంటలకు 25 కోట్ల రూపాయల వ్యయంతో మరమ్మత్తులు చేసిన అలిపిరి నడకమార్గం ప్రారంభిస్తారు.

సాయంత్రం 4:10 నిమిషాలకు 13 కోట్ల రూపాయల వ్యయంతో అలిపిరి వద్ద నిర్మించిన గో మందిరం ప్రారంభిస్తారు సీఎం జగన్‌. ఇక రేపు సాయంత్రం 5 గంటల సమయంలో తిరుమల చేరుకోనున్న సీఎం జగన్…  6 గంటలకు బేడీ ఆంజనేయస్వామి ఆలయం నుంచి ఊరేగింపుగా బయలుదేరి… శ్రీవారికి పట్టు వస్ర్తాలను సమర్పించనున్నారు. రాత్రి 7:30 గంటలకు గరుడ వాహన సేవలో పాల్గొనున్న సీఎం జగన్‌… 12వ తేది ఉదయం కర్నాటక సీఎం బోమ్మైతో కలసి యస్వీబిసి కన్నడ, హిందీ చానల్స్ ప్రారంభించనున్నారు.  అలాగే.. రూ. 12 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన బూందీ పోటును ప్రారంభించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news