అధికారంలోకి వచ్చిన నాటి నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన మీదనే దృష్టి పెట్టారు. ప్రజాపాలనే లక్ష్యంగా ముదుకు వెళ్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా వరుసగా అమలు చేసుకుంటూ పాలనలో దూసుకుపోతున్నారు. అయితే తాజాగా ఇప్పుడు పేదింటి అక్కల కోసం ‘వైఎస్ఆర్ చేయూత’ పధకాన్ని అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ పధకం ద్వారా 45-60 ఏళ్ల వయసు కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగేళ్లకు గాను రూ. 75 వేల ఆర్ధిక సాయాన్ని ఉచితంగా అందజేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 24.19 లక్షల మంది మహిళలు ఈ పధకం ద్వారా లబ్ది పొందనుండగా.. దీని అమలుకు ఏపీ ప్రభుత్వం ఒక్కో ఏడాదికి రూ.4,535.70 కోట్ల చొప్పున నాలుగేళ్లలో రూ.18,142.8 కోట్లను ఖర్చు చేయనుంది. కాగా, అధికారిక వర్గాల లెక్కల ప్రకారం రాష్ట్రంలో 45-60 ఏళ్లు కలిగిన మహిళలు ఎస్సీలలో 5.89 లక్షల మంది, ఎస్టీలలో 1.63 లక్షల మంది, బీసీల్లో 15.26 లక్షల మంది, మైనార్టీ లలో 1.40 లక్షల మంది మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది.
మహిళల కోసం.. జగన్ కీలక నిర్ణయం..!
-
Read more RELATEDRecommended to you
ట్రాన్స్జెండర్లు, యాచకుల సంరక్షణ కోసం కేంద్రం తీసుకొచ్చిన ఈ పథకం గురించి తెలుసా..?
స్మైల్ అంటే సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్ ఫర్ లైవ్లీహుడ్ మరియు...
శంషాబాద్ ఎయిర్ పోర్టులోకి చిరుత..గాలిస్తున్న అధికారులు
శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద చిరుత కలకలం రేపింది. దీంతో చిరుతను...
26 ఏళ్ల యువకుడి స్టాటప్ జర్నీ..అమ్మ దగ్గర రూ.3 వేలు అప్పుగా తీసుకోని ఇప్పుడు 8 కోట్ల కంపెనీని స్థాపించాడు..!
జీవితంలో విజయం సాధించిన వారి దారి ఎప్పుడు సుగుమంగా ఉండదు.. వాళ్లు...