సీఎం జగన్ కి ఈసారి ఎన్నికల్లో ఘోర ఓటమి తప్పదు – యనమల

-

సీఎం జగన్ కి ఈసారి ఎన్నికలలో ఘోర ఓటమి తప్పదని అన్నారు టిడిపి పొలిటి బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు. చంద్రబాబు – పవన్ కళ్యాణ్ కలవాలంటే సీఎం జగన్ అనుమతి తీసుకోవాలా? అని ప్రశ్నించారు. పొత్తులు ఎన్నికల సమయంలో తీసుకునే నిర్ణయమని అన్నారు. జాతీయ పార్టీని పొత్తులు పెట్టుకుంటుంటే.. ప్రాంతీయ పార్టీలు పెట్టుకోకూడదా? అని ప్రశ్నించారు.

జగన్ క్రిమినల్ అయినందువల్లే ఎవరైనా కలవడానికి భయపడతారని విమర్శించారు. జగన్ మోడీ, అమిత్ షాను ఎందుకు కలుస్తున్నారని ప్రశ్నించారు. 40 ఏళ్లుగా ఉన్న పార్టీతోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం పై ప్రజావ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందన్నారు. చంద్రబాబు నాయకత్వం కోసం ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు యనమల రామకృష్ణుడు.

Read more RELATED
Recommended to you

Latest news