25 లక్షల మంది మహిళలకు వైఎస్‌ఆర్‌ చేయూత : సీఎం జగన్

-

తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రి కృష్ణదాస్, సీఎస్‌ సాహ్ని, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. 2020–21లో రూ.2,51,600 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గతేడాది కంటే 9.78 శాతం ఎక్కువ రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. వ్యవసాయ రంగానికి రూ.1,28,660 కోట్ల రుణాలు ఇవ్వాలని.. వ్యవసాయ రుణాలు గతేడాది కంటే 11.9 శాతం పెంచాలని నిర్ణయించారు.

CM JAGAN
CM JAGAN

2019-20 రుణప్రణాళికలో 99.42 శాతం లక్ష్యం చేరుకున్నామని అధికారులు వెల్లడించారు. ఖరీఫ్‌ రుణాలకు సంబంధించి సున్నా వడ్డీని రబీ నాటికి చెల్లిస్తామన్న అధికారులు…రబీ రుణాలకు సంబంధించి సున్నా వడ్డీని ఖరీఫ్‌ నాటికి చెల్లిస్తామని ముఖ్యమంత్రికి తెలిపారు. గిడ్డంగులు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యానిట్లకు సాయం చేయాలని అధికారులు వివరించారు.అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఆర్థిక సాయం చేస్తున్నామని సీఎం అన్నారు. ఈ సహాయంతో వారి జీవితాల్లో మార్పులు తీసుకువచ్చే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. నాలుగేళ్ల పాటు ఏడాదికి రూ.18,750 చొప్పున లబ్ధిదారు మహిళలకు ఇస్తామని సీఎం తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news