వైసీపీ ముఖ్య నేతలతో సీఎం జగన్ సమావేశం

-

వైసీపీ ముఖ్య నేతలతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. ఇవాళ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు ఏపీ సీఎం జగన్. ఈ సందర్భంగా ఆయా జిల్లాల్లో సామాజిక వర్గాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేయనున్నారు జగన్‌. ఇప్పటికే గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సి అభ్యర్థుల ప్రకటన చేశారు.

స్థానిక సంస్థల కోటలో అభ్యర్థులపై చర్చ జరుగనుంది. నిన్న వైసీపీలో చేరిన జయమంగల వెంకటరమణకు స్థానిక సంస్థల కోటలో హామీ ఇచ్చారు జగన్‌. అలాగే మొన్న కలిసిన కుడిపూడి సూర్యనారాయణకు కూడా ఖరారు చేశారు సీఎం జగన్‌. మొత్తంగా 14 స్థానాల్లో 3 గ్రాడ్యుయేట్ 2 టీచర్ల ప్రకటన చేశారు. ఇక మిగిలిన 9 స్థానిక సంస్థలు స్థానాలకు ఇద్దరు ఖరారు అయింది. మిగిలిన ఏడుగురు అభ్యర్థుల పై నిర్ణయం తీసుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news