ఈనెల 19న సీఎం జగన్ శ్రీకాకుళం పర్యటన

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 19న శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు సీఎం జగన్. టెక్కలి నియోజకవర్గం లో మూలాపేట వద్ద భవనపాడు పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే హిరమండలంలో ఎత్తిపోతల పథకం, ఆమదాలవలస నియోజకవర్గంలో బలసరేవు వంతెన నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు.

భవనపాడు పోర్టు నిర్మాణం జరిగితే సెజ్ మాదిరిగా అక్కడే ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఇక సీఎం పర్యటన నేపథ్యంలో పటిష్ట బందోబస్తుకు చర్యలు చేపడుతున్నారు జిల్లా పోలీసు అధికారులు. సీఎం పర్యటన బందోబస్తు ఏర్పాట్లు, ట్రాఫిక్ మళ్లింపు, వివిఐపి వాహనాల పార్కింగ్, హెలిప్యాడ్, ప్రోటోకాల్ తదితర అంశాలపై నగరంలో జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారమే సమీక్ష సమావేశం నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news