వరుస సమీక్షలతో కేసీఆర్ బిజీ బిజీ

-

తెలంగాణా సిఎం కేసీఆర్ వరుస సమీక్షా సమావేశాలతో బిజీ బిజీ గా గడుపుతున్నారు. ఎప్పటికప్పుడు ఆయన అధికారులకు ఆదేశాలు ఇస్తూ కరోనా వైద్యానికి సంబంధించి సూచనలు సలహాలు ఇస్తూ ముందుకు వెళ్తున్నారు. నిన్న కరోనాకు సంబంధించి ఆయన సమీక్షలు నిర్వహించారు. ఇక మధ్యాహ్నం 2 గంటలకు ఇరిగేషన్ పై సీఎం కేసీఆర్ రివ్యూ నిర్వహిస్తున్నారు.

సీతారామ, దేవాదుల, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహిస్తున్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిస్థితులపై ఆరా తీయనున్న సీఎం కేసీఆర్… కొన్ని కీలక ఆదేశాలు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల పై, ఎన్పిఏల అంశంపై సమీక్షలో చర్చ జరుగుతుంది. చెరువులు నిండి ఉన్న నేపథ్యంలో వర్షాకాలం నీటి మళ్ళింపు అంశం పై సమీక్ష జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news