ఆవేశం వద్దు.. ఆలోచనతో దేశాన్ని కాపాడుకుందాం : కేసీఆర్

-

దేశాన్ని కాపాడుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిద్దామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా చివరకు న్యాయమే గెలుస్తుందని  స్పష్టం చేశారు. ఆవేశంతో కాదు.. ఆలోచనతో దేశాన్ని కాపాడుకుందామని  కేసీఆర్ పిలుపునిచ్చారు.

దేశం.. సరైన నాయకుడు, పార్టీ కోసం ఎదురుచూస్తోందని ఇలాంటి పరిస్థితుల్లో దేశాన్ని రక్షించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తామని  కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఈ దేశం అందరిదని… గంగజమునా తెహజీబ్‌ సంస్కృతిని కాపాడేందుకు చివరి రక్తపు బొట్టు వరకు పోరాడతానని అన్నారు. హైదరాబాద్‌ ఎల్‌బీ స్టేడియంలో రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో దావత్ ఏ ఇఫ్తార్ విందులో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు.

మహారాష్ట్రలో బీఆర్​ఎస్​కు ఘన స్వాగతం లభించిందన్న కేసీఆర్.. నడిపించే సరైన నేత కోసం దేశం ఎదురుచూస్తోందన్నారు. దేశాన్ని కాపాడుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు చెప్పారు.

రాష్ట్రప్రభుత్వం తరహాలో కేంద్రం సమర్థంగా పనిచేసి ఉంటే… తెలంగాణ జీఎస్​డీపీ మరింత ప్రగతిలో ఉండేదని కేసీఆర్‌ స్పష్టం చేశారు. మైనార్టీల సంక్షేమం కోసం 9ఏళ్లలోనే 12వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. తలసరి ఆదాయం, విద్యుత్‌ వినియోగంలో దేశంలో అగ్రగ్రామిగా ఉన్నామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news