ఆర్టీసీ ఉద్యోగులకు సిఎం కేసీఆర్ గుడ్ న్యూస్

-

ఆర్టీసీ ఉద్యోగులకు సిఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. లాక్ డౌన్ కాలంలో ఉద్యోగులకు వాయిదా వేసిన సగం జీతాలను ఇప్పుడు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 120 కోట్లు విడుదల చేయడానికి సిఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. దీనిపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు సిఎం కేసీఆర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన ఆర్ధిక శాఖకు ఆదేశాలు ఇచ్చారు.

ఇక హైదరాబాద్ లో సిటీ బస్సులకు సంబంధించి కూడా ఆదేశాలు ఇచ్చారు. రేపట్నుంచి గ్రేటర్ హైదరాబాద్ లో 50 శాతం సిటీ బస్సులను నడపాలని ఆయన సూచించారు. ప్రస్తుతం సిటీలో 20 శాతం బస్సులను మాత్రమే నడుపుతున్న గ్రేటర్ ఆర్టీసీ… సీఎం కెసిఆర్ ఆదేశాలతో గ్రేటర్లో సిటీ సర్వీసులను ఆర్టీసీ యాజమాన్యం పెంచుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news