సచివాలయ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త

-

తెలంగాణ సచివాలయ ఉద్యోగులకు సీఎం కేసీఆర్‌ తీపి కబురు అందించనున్నారు. సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ.. సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పదోన్నతులు కల్పిస్తూ జారీ చేసే ఫైల్ పై సీఎం కెసిఆర్ సంతకం చేయనున్నారు. దీంతో 120 మంది కి సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు దక్కనున్నాయి. 59 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు… సెక్షన్ ఆఫీసర్లుగా పదోన్నతులు పొందనున్నారు.

cm kcr | సీఎం కేసీఆర్
cm kcr | సీఎం కేసీఆర్

అటు 33 మంది సెక్షన్ ఆఫీసర్లు అసిస్టెంట్ సెక్రెటరీలుగా పదోన్నతులు పొందనున్నారు. 20 మంది అసిస్టెంట్ సెక్రెటరీలు డిప్యూటీ సెక్రెటరీలుగా పదోన్నతులు పొందనున్నారు.  8 మంది డిప్యూటీ సెక్రెటరీలు జాయింట్ సెక్రెటరీలుగా పదోన్నతులు పొందనున్నారు.

4 గురు జాయింట్ సెక్రెటరీలు అడిషనల్ సెక్రెటరీలుగా పదోన్నతులు పొందనున్నారు. ఈ మేరకు కాసేపట్లో నే జీవో విడుదల కానుంది. దీంతో సచివాలయ ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. కాగా..  కాసేపటి క్రితమే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌..  ఢిల్లీ కి వెళ్లారు.  రేపు టీఆర్ఎస్‌ పార్టీ భవనం శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ పాల్గొనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news