BREAKING : నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్.. జంతర్ మంతర్ వద్ద దీక్ష

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వాల మధ్య వైరం చిలికి..చిలికి గాలి వానలా తయారైంది. రెండు ప్రభుత్వాలు ఎక్కడా తగ్గేదేలా అన్నట్లుగానే.. ధాన్యం కొనుగోలు అంశంపై వ్యవహరిస్తున్నాయి. రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా.. టీఆర్‌ఎస్‌ పార్టీ ధర్నాలకు పిలుపు ఇవ్వగా.. ఇవాళ సీఎం కేసీఆర్‌ ఢిల్లీ పయనం కానున్నారు.

ఇవాళ మధ్యాహ్నం 2 గంటల సమయంలో.. ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం కేసీఆర్‌. దాదాపు నాలుగు రోజుల పాటు సీఎం కేసీఆర్‌.. ఢిల్లీలోనే ఉండనున్నారని సమాచారం అందుతోంది. అంతేకాదు.. ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద.. సీఎం కేసీఆర్‌ ధర్నాకు కూర్చూనే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.

ఎన్నిసార్లు కేంద్ర మంత్రులు, ప్రధాని మోడీని కలిసినా.. ధాన్యం కోనుగోలు అంశంపై.. కేంద్రం మొండిగా వ్యవహరించడంతో… స్వయంగా సీఎం కేసీఆరే రంగంలోకి దిగాలని అనుకుంటున్నారని సమాచారం. ఢిల్లీలో ధర్నా చేస్తే..రైతుల సమస్య దేశ్య వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారనుంది. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్ ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news