BREAKING NEWS: రేపు యాదగిరిగుట్టకు సీఎం కేసీఆర్

-

అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్న యాదాద్రి పున: నిర్మాణ పనులు సాగుతున్నాయి. తాజాగా రేపు యాదగిరిగుట్ట గుట్టకు పర్యటనకు సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. ముగింపు దశలో ఉన్న యాదగిరి గుట్ట ఆలయ పనులను పరిశీలించనున్నారు సీఎం కేసీఆర్. ఆలయ పున: సంప్రోక్షణ కోసం నిర్వహిస్తున్న సుదర్శన యాగం ఏర్పాట్ల గురించి చర్చించనున్నారు. ఇతర ఏర్పాట్ల గురించి చర్చించనున్నారు. మార్చి 22 నుంచి 28 వరకు యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పున: ప్రారంభోత్సవాలు జరుగనున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా యాదాద్రి అభివ్రుద్ది పనులను చేస్తున్నారు. దేశంలోనే ప్రముఖ పుణ్య క్షేత్రంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా సీఎం కేసీఆరే స్వయంగా పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు యాదాద్రిని దర్శించారు కేసీఆర్. ఆలయ నిర్మాణ పనులను పర్యవేక్షించారు. ఆలయ నిర్మాణంలో సూచనలిచ్చారు. ప్రస్తుతం పనులు ముగింపు దశకు చేరుకోవడంతో మరోసారి యాదాద్రికి వెళ్లనున్నారు కేసీఆర్.

 

Read more RELATED
Recommended to you

Latest news