ఈ నెల 4న సిరిసిల్లలో సీఎం కేసీఆర్ పర్యటన…

-

మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌ ఎపిసోడ్‌ అనంతరం.. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు అలెర్ట్‌ అయ్యారు. ఈటెల రాజేందర్‌ కారణంగా పార్టీకి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు సీఎం కేసీఆర్. అందులో భాగంగానే… గాంధీ, వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రుల్లో స్వయంగా సీఎం కేసీఆర్‌ పర్యటించి.. అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. అంతటితో ఆగకుండా.. ఇక ఇప్పుడు వరుసగా జిల్లాల పర్యటనలు పెట్టుకున్నారు ముఖ్యమంత్రి. ఇప్పటికే సిద్దిపేట, కామారెడ్డి మరియు యాదాద్రి జిల్లాల్లో సీఎం కేసీఆర్‌ పర్యటించారు.

ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను శ్రీకారం చుట్టారు. అయితే.. తాజాగా..రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ నెల 4న సిరిసిల్లకు రానున్నారు సీఎం కేసీఆర్‌. సిరిసిల్ల నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పేదలకు ఇవ్వనున్న కేసీఆర్…. సిరిసిల్ల నూతన కలెక్టరేట్, నర్సింగ్ కళాశాలను ప్రారంభించనున్నారు.  సీఎం కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే ఏర్పాట్లు మొదలు పెట్టింది జిల్లా అధికార యంత్రాంగం.

Read more RELATED
Recommended to you

Latest news