మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన సీఎం రేవంత్

-

మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పేరు కాంగ్రెస్ తొలి అభ్యర్థి పేరును టీపీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీ చంద్ రెడ్డిని మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా అనౌన్స్ చేశారు.యాబై వేల ఓట్ల మెజార్టీతో వంశీ చంద్ రెడ్డిని గెలిపించాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కోరారు.

ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి కొడంగల్ లో తొలిసారి రేవంత్ రెడ్డి ఇవాళ ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో పర్యటించారు.ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేశారు.అనంతరం నారాయణ పేట జిల్లా కోస్గిలో ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీ చంద్ రెడ్డి పేరును ఖరారు చేశారు. కాగా, ఇప్పటికే వంశీ చంద్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో పాదయాత్ర చేపట్టి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మహబూబ్ నగర్ ఎంపీ ఆయనకే ఫిక్స్ అని వార్తలు వినిపించగా.. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ అధికారికంగా ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news