మానవత్వం చాటుకున్న సీఎం రేవంత్ రెడ్డి

-

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి మానవత్వం చాటుకున్నారు. ఓ వ్యక్తి అత్యవసర పరిస్థితిలో ఉండగా తన కాన్వాయిని అంబులెన్స్ను పంపారు. దీంతో ఆయన ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన హైదరాబాద్లో జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లా వైరల్గా మారింది. కాగా ముఖ్యమంత్రి నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

కాగా, గురువారం చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారంలో మాట్లాడుతూ.. కారు పని అయిపోయందని.. అందుకే కేసీఆర్ బస్సు వేసుకొని బయలుదేరాడని ఎద్దేవా చేశారు. గద్దర్ కలవడానికి వస్తే 4 గంటల పాటు గేటు బయటే నిలబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ అహంకారాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు రాత్రింబవళ్లు కష్టపడి ఖతం చేశారని అన్నారు. చేతులు కాలినాక కేసీఆర్ ఆకులు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడని రేవంత్ రెడ్డి సెటైర్ వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news