కరీంనగర్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్..!

-

కరీంనగర్ బస్టాండ్ లో చీరలను అడ్డుగా కట్టి ఓ గర్భిణీకి ఆర్టీసీ సిబ్బంది డెలీవరీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన పై సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. కరీంనగర్ బస్ స్టేషన్ లో గర్భినీకి కాన్పు చేసి మానవత్వం చాటుకున్న టీజీఎస్ ఆర్టీసీ సిబ్బందికి నా అభినందనలు. మీరు సకాలంలో స్పందించడం వల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. విధి నిర్వహణలో కూడా మీరు అలాగే మంచి తీసుకురావాలని ఆశిస్తున్నానని తెలిపారు.

మరోవైపు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా ఈ ఘటన పై స్పందించారు. పరిమళించిన మానవత్వం తాజాగా ట్వీట్ చేశారు. కరీంనగర్ బస్ స్టేషన్ లో నిండు చూలాలికీ కాన్పు చేసిన టీజీఎస్ ఆర్టీసీ మహిళా సిబ్బంది మానవత్వం అభినందనీయమన్నారు. మీరు సకాలంలో స్పందించి డెలివరీ చేయడం వల్లనే తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు. మానవత్వం చాటుకోవడంలో ఆర్టీసీ ముందుంటుందని సిబ్బంది మరోసారి నిరూపించారని హర్షం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news