రైతులకు గుడ్ న్యూస్.. రైతు భరోసా పై సీఎం రేవంత్ కీలక ప్రకటన..!

-

ఆరు గ్యారెంటీల అమలు పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎల్బీ స్టేడియంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ లీడర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలను అమలు చేశామని.. గుర్తు చేశారు. ఫిబ్రవరి రెండో వారంలో మరో రెండు గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రకటించారు. అంతేకాదు.. ఫిబ్రవరి నెలాఖరు వరకు రైతుభరోసా ద్వారా నగదును కూడా అందిస్తామని హామీ ఇచ్చారు.

పదే పదే బీఆర్ఎస్ నేతలు చేస్తున్న మేస్త్రీ కామెంట్స్  పై రేవంత్ రెడ్డి స్పందించారు. అవును నేను మేస్త్రీనే.. తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రీనే అని కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మోడీనీ ఓడించి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని పిలుపునిచ్చారు. 18 ఏళ్లకే ఓటు, యువతకు కంప్యూటర్లు పరిచయం చేసింది ఇందిరాగాంధీ బిడ్డ రాజీవ్ గాంధీనే అన్నారు. కాంగ్రెస్ దేశం కోసం పోరాడినప్పుడు.. ఈ బీజేపీ ఎక్కడ ఉందన్నారు. మీ నాయకులు ఎవరైనా దేశం కోసం ప్రాణాలు ఇచ్చారా..? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news