సీబీఐ కోర్టు విచార‌ణ‌కు డుమ్మా కొట్టిన‌ ఏపీ సీఎం జగన్.. రీజ‌న్ అదేనా..

-

అక్రమాస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రతి శుక్రవారం హైదరాబాద్ నాంపల్లిలోని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) న్యాయస్థానానికి హాజరవుతారన్న విషయం తెలిసిందే. అయితే ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి నేడు విచారణకు హాజరుకాలేదు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పర్యటన ఉన్నందున మినహాయింపు ఇవ్వాలంటూ కోర్టును జగన్ కోరారు. అయితే.. ఆయన చేసుకున్న అభ్యర్థనను సీబీఐ న్యాయస్థానం అంగీకరించింది.

అక్రమాస్తుల కేసులో తదుపరి విచారణ ఈ నెల 22కి వాయిదా పడింది. కాగా, ఈ కేసులో కోర్టు విచారణకు హాజరవడంపై తనకు మినహాయింపును ఇవ్వాలంటూ జగన్ పెట్టుకున్న పిటిషన్ ఇటీవలే న్యాయస్థానం కొట్టేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news