కేసీఆర్ సొంత గ్రామం చింతమడక లో 164 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభం

-

సిద్దిపేట జిల్లా : సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామంలో 164 డబ్బులు బెడ్ రూం ఇళ్ళను ప్రారంభించారు మంత్రి హరీష్ రావు. ఈ కార్యక్రమం లో టిఆర్ఎస్ పార్టీ కీలక నేతలు మంత్రి హరీష్ రావుతో పాటు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారన్నారు.

గతంలో తెలంగాణ ఉద్యమంలో గ్రామ ఆదర్శంగా ఉంది, వేరే పార్టీ వాళ్ళను గ్రామంలో కి రాకుండా అడ్డుకున్నారని పేర్కొన్నారు. చింతమడక గ్రామం ను చూస్తే గ్రేటర్ కమ్యూనిటీ లాగా అందంగా అనిపించిందని స్పష్టం చేశారు మంత్రి హరీష్ రావు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగ లో కొంచెం మార్పు తీసుకురావాలని అన్నారు, ఎస్ సి ,ఎస్టీ లకు నిధులు అమలు అవడం లేదని తెలిపారు మంత్రి హరీష్ రావు. దళితులకు 8 వేల కోట్లా రూపాయలు కేటాయించారు అని పేర్కొన్నారు మంత్రి హరీష్ రావు. ప్రభుత్వ కంపెనీ లు అన్ని కేంద్ర ప్రభుత్వం అమ్మకాల కు పెట్టింది, ప్రవైట్ కంపెనీ లు రిజర్వేషన్లు ఇస్తారా ? అని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news