మూడేళ్ల తర్వాత నాగశౌర్య కు కౌంటర్ ఇచ్చిన సాయిపల్లవి..!

-

అందాల ముద్దుగుమ్మ సాయి పల్లవి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సాయి పల్లవి మలయాళం ప్రేమమ్ సినిమాతో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమాతో టాలీవుడ్ లో కూడా మంచి విజయాన్ని అందుకొని వరుస క్రేజీ సినిమా అవకాశాలు దక్కించుకుంది. అందులో భాగంగా సాయి పల్లవి, నాగ శౌర్య హీరోగా తెరకెక్కిన ‘కణం’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల అయ్యింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో నాగ శౌర్య కు సాయి పల్లవి కి మధ్య మాటామాటా వచ్చిన సంగతి తెలిసిందే. 2018 లో మూవీ విడుదల సమయంలో హీరో నాగ శౌర్య పలు ఇంటర్వ్యూలలో సాయి పల్లవి ని విమర్శించారు. ఆమె అన్‌ ప్రొషెషనల్‌ హీరోయిన్‌ అనీ, అనవసరమైన విషయాలకు కూడా కోపం తెచ్చుకుని సహనం కోల్పోవడం ఆమెలో తనకు నచ్చని గుణమని నాగ శౌర్య అప్పట్లో అన్నాడు.

తన ప్రవర్తన వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు అని నాగశౌర్య తెలియజేశాడు. నాగ శౌర్య చేసిన వ్యాఖ్యలు సాయి పల్లవి దృష్టికి వెళ్లడంతో దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ఆ వ్యాఖ్యలపై సాయి పల్లవి స్పందించండి. ఆ తర్వాత వెంటనే ‘కణం’ సినిమా దర్శకుడు ఎ.ఎల్‌.విజయ్‌, కెమెరామెన్‌ నిరవ్‌షాకు ఫోన్‌ చేసి సెట్‌లో నా వల్ల ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా అని అడుగగా.. వారు అలాంటిది ఏమీ లేదు అని చెప్పారు. నాగ శౌర్య అంటే నటుడిగా నాకు గౌరవం. నాగ శౌర్య నాలో నచ్చని గుణం గురించి బయటకు చెప్పారు. ఆ విషయాన్ని నేను పాజిటివ్ గా తీసుకున్నాను. నిజంగా సెట్‌లో నా వల్ల నాగ శౌర్య కు ఇబ్బంది కలిగింది అంటే బాధగా ఉంది. నా సమాధానంతో ఇప్పుడైనా నాగ శౌర్య సంతృప్తి చెందుతాడు అని ఆశిస్తున్నాను అని సాయి పల్లవి తెలియజేసింది.

Read more RELATED
Recommended to you

Latest news