నాణ్య‌త విష‌యం లో రాజీప‌డ్డ‌ద్దు : స‌చివాలయం పై సీఎం కేసీఆర్

-

తెలంగాణ స‌చివాలయం నిర్మాణాన్ని ముఖ్య మంత్రి కేసీఆర్ ప‌రిశీలించారు. సచివాలయంలో ఎలివేషన్‌, ఫైనల్‌ వర్క్‌పై తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి ప‌లు సూచనలు చేశారు. సచివాలయంలో బ‌య‌ట‌ గొడల డిజైనింగ్ ను కూడా సీఎం కేసీఆర్ పరిశీలించారు. అనంత‌రం స‌చివాల‌యం నిర్మాణం గురించి అధికారుల తో కాంట్రాక్ట్ ల తో మాట్లాడారు. సచివాలయ నిర్మాణ పనులు వేగం గా పూర్తి చేయాల‌ని సీఎం కేసీఆర్ అన్నారు.

అలాగే స‌చివాల‌యం నిర్మాణ ప‌నులు వేగం గా జ‌రుగుతున్నాయ‌ని.. ఇది ఇలాగే కొన‌సాగాల‌ని అన్నారు. అలాగే భ‌వ‌నం నాణ్యత విషయంలో ఎవ‌రూ కూడా రాజీపడొద్దు ని అధికారుల‌కు సీఎం కేసీఆర్ సూచించాడు. అలాగే ఇత‌ర రాష్ట్రాల లో ఉన్న అన్ని స‌చివాల‌యాలను పరిశీలించాల‌ని అన్నారు. తెలంగాణ రాష్ట్ర స‌చివాలయం దేశం గ‌ర్వించేలా ఉండాల‌ని సూచించాడు. కాగ తెలంగాణ రాష్ట్రం లో స‌చివాల‌యం నిర్మించ‌డానికి ప్ర‌భుత్వం నిర్ణయం తీసుకున్న విష‌యం తెలిసిందే. దీని కోసం ప్ర‌భుత్వం కోట్ల రూపాయ‌ల‌ను వెచ్చిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news