సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తిన ఎమ్మెల్సీ జీవం రెడ్డి…

-

తెలంగాణ సీఎం కేసీఆర్ పై కొన్ని విషయాలను ప్రస్తావిస్తూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఈయన మాట్లాడుతూ ప్రస్తుతం తెలంగాణాలో కేసీఆర్ మాటలు వినేటోళ్లు ఎవ్వరూ లేరని, ఈయన మాటలకు ఇప్పుడు కాలం కాదని వ్యాఖ్యలు చేశాడు. నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా అంటాడు.. కానీ చేసే దేనిలో అయినా సరైన క్లారిటీ ఉండదు అంటూ విమర్శించారు. దళితబంధు పధకంలో లబ్దిదారులను ఎంపిక చేసే ప్రక్రియలో సరైన ప్యాట్రన్ లేదు. తమకు ఇష్టం వచ్చిన వారిని సెలెక్ట్ చేసుకుంటూ పోతున్నారని మండిపడ్డారు. ఇక బీసీల అభివృద్ధి మాట ఎటు పాయెనో .. దీనికి సరైన యాక్షన్ ప్లాన్ లేకపోవడం దురదృష్టకరం అన్నారు జీవన్ రెడ్డి.

ఇక ఫైనల్ గా ఇటీవల జరిగిన పేపర్ లీక్ ఘటన గురించి ఆగ్రహం చెందాడు. పేపర్ లీక్ అవడం వలన ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియ వేగంగా ముందుకు వెళ్లడం లేదని రెచ్చిపోయి మాట్లాడారు. ఇలా కేసీఆర్ చేస్తున్న చాలా పనుల్లో క్లారిటీ లేదని.. ఇక రిజల్ట్ గురించి ఎంత తక్కువ మర్లాడుకుంటే అంతమంచిదన్నారు జీవన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news