అవినాష్ రెడ్డి పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు – సజ్జల

-

అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణారెడ్డి. అవినాష్ రెడ్డి తల్లి అనారోగ్యంగా వున్నారని తెలిపారు. అవినాష్ రెడ్డిని సీబీఐ సాక్ష్యం చెప్పడానికి పిలిచిన ప్రతిసారి వెళ్లారని వివరించారు సజ్జల. సీబీఐ అవినాష్ రెడ్డి ని నిందితుడు అని ఎప్పుడై తో చెప్పిందో.. అనుమానంతో ముందస్తు బెయిల్ కోసం వెళ్లారని తెలిపారు.

సీబీఐ పిలిచినాక రేపు అయినా విచారణకు అవినాష్ రెడ్డి వెళతారని అన్నారు. పులివెందుల వెళ్ళటానికి అవినాష్ రెడ్డికి సీబీఐ అనుమతి ఉందో లేదో తెలియదన్నారు. తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని సీబీఐకి సమాచారం ఇచ్చి వుంటారని పేర్కొన్నారు. వివేకానంద రెడ్డి హత్య చేశామని చెప్పిన వ్యక్తి బయట వున్నారని, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారని, సెటిల్ మెంట్ చేస్తారని ఆరోపించారు. ఇక నేడు మీడియాపై జరిగిన దాడి దురదృష్టకరం అన్నారు సజ్జల. ఈ దాడి అవినాష్ రెడ్డికి తెలిసి జరిగి ఉండదన్నారు.

దాడికి కారణం అయిన అంశాలు కూడా విచారించాలన్నారు. మీడియా వెంటపడుతుంటే అవినాష్ రెడ్డి అభిమానులు స్పందించి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. సీబీఐ అరెస్ట్ చేయాలి అనుకుంటే ఎన్ని రోజులు తప్పించుకుంటారని అన్నారు. వివేకా హత్య కేసులో అవినాష్ పాత్ర ఉంటే చంద్రబాబు వదిలేవారా? అని ప్రశ్నించారు. ఏం జరిగిందో వీళ్లకు తెలిసి ఉంటే సీబీఐ వీళ్ళని పిలిచి విచారించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news