రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్‌ పార్టీ భారీ ర్యాలీ.. పాల్గొగనున్న సోనియా గాంధీ

-

బీజేపీ పార్టీని… అన్ని విధాల అడ్డుకునేందుకు.. కాంగ్రెస్‌ పార్టీ అనేక వ్యూహ రచనలు చేస్తోంది. ఎలాంటి ఛాన్స్‌ వచ్చినా.. వదులు కోకుండా… ఎత్తుగడలు రచిస్తోంది కాంగ్రెస్‌ పార్టీ. ఇక తాజాగా… దేశ రాజధాని అయిన ఢిల్లీ లోని రామలీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ తీయాలని… అధిష్టానం నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 12 వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఈ భారీ ర్యాలీ నిర్వహించనుంది.

పెరిగిన ధరలకు నిరసనగా నవంబర్ 14 నుంచి 29 వరకు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది “జనజాగరణ్ అభియాన్”. దానికి ముగింపు గా ఢిల్లీలో డిసెంబరు 12 వ తేదీన భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్‌ పార్టీ. ఈ భారీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ర్యాలీ లో పాల్గొననున్నారు. వారితో పాటు ఈ భారీ బహిరంగ సభ లో పాల్గొననున్నారు ఏఐసిసి కార్యనిర్వాహక వర్గం, సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్.పిలు, అన్ని రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు, సి.ఎల్.పి నాయకులు.

Read more RELATED
Recommended to you

Latest news