ఖుష్బూకు షాక్ ఇచ్చిన కాంగ్రెస్…!

-

కాంగ్రెస్ పార్టీ… సినీ నటి కుష్బూకి షాక్ ఇచ్చింది. ఖుష్బూ సుందర్‌ ను పార్టీ అధికార ప్రతినిధిగా కాంగ్రెస్ తొలగించింది. ఆమె కాంగ్రెస్ ప్రాధమిక సభ్యురాలికి రాజీనామా చేసి, ఈ రోజు మధ్యాహ్నం బిజెపిలో చేరనుంది. ఈ రోజు మధ్యాహ్నం ఆమె బిజెపిలో చేరే అవకాశం ఉంది. తమిళనాడు ఎన్నికలు వస్తున్న నేపధ్యంలో ఆమె బిజెపిలో చేరి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు.

కాంగ్రెస్ శైలి పట్ల ఆమె చాలా సీరియస్ గా ఉన్నారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా సమక్షంలో ఆమె బిజెపిలో చేరతారు. పలు పదవుల్లో ఆమె కాంగ్రెస్ లో పని చేసారు. పార్టీ తరుపున బలమైన వాణి వినిపించారు. కాసేపటి క్రితం ఆమె కాంగ్రెస్ నుంచి తప్పుకున్నారు. 2010 లో ఆమె డిఎంకెలో చేరారు. ఆ తర్వాత 2016 లో కాంగ్రెస్ లో చేరారు.

Read more RELATED
Recommended to you

Latest news