కాంగ్రెస్ 4 నెలల్లో రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లింది: హరీశ్ రావు

-

లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇప్పటికే ఆయా పార్టీలు ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాయి.దుబ్బాక నియోజకవర్గంలోని దౌల్తాబాద్‌లో జరిగిన మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…

కేసీఆర్ అభివృద్ధి బాట పట్టించిన రాష్ట్రాన్ని కాంగ్రెస్ 4 నెలల్లోనే వెనక్కి తీసుకెళ్లిందని ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. ‘కాంగ్రెస్ ఫేక్ వార్తలను నమ్ముకుని రాజ్యం నడుపుతోంది. వాటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత యువతపై ఉంది అని అన్నారు. కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపి ప్రజలకు చేసిందేమీ లేదు.

నల్లచట్టాలు తెచ్చి 700 మంది రైతుల ప్రాణాలు తీసింది అని తెలిపారు. నిరుద్యోగం, పేదరికం పెరిగింది.’ అని అన్నారు.రైతులు ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్ముకోవద్దు.. రూ. 500 బోనస్ వచ్చేదాకా కొట్లాడదాం అని పిలుపునిచ్చారు. రేవంత్ రైతులకు ఇచ్చిన ఏ హామీని కూడా అమలు చేయలేదు. రైతుబంధు రూ. 15 వేలు, ఆసరా పింఛన 4 వేలు, నిరుద్యోగ భృతి 4 వేలు, ఉచిత కరెంట్, ఆడపిల్లలకు తులం బంగారం, స్కూటీ.. ఈ హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదు.. అమలైనవాళ్లు కాంగ్రెస్ పార్టీకి, కానివాళ్లు బీఆర్ఎస్‌కు ఓటేయండి అని అన్నారు.నాలుగు నెలల్లోనే ప్రజల జీవితాలు అస్తవ్యస్తమయ్యాయి. సాగు నీళ్లు రాలేదు. మంచి నీళ్లు రాలేదు .24 గంటల కరెంట్ బంద్ అయింది.. కేసీఆర్ హయాంలో అమలైన కేసీఆర్ కిట్ బంద్ చేశారు.. అభివృద్ధి కొనసాగించకుండా అడ్డుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news