పార్టీ మహిళా నేత పై కాంగ్రెస్ కార్యకర్తల దాడి…!

-

హథ్రస్ ఘటన మరువక ముందే యూపీలో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి పార్టీ టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ నాయకురాలి పై సొంతపార్టీ నేతలే దాడి చేశారు. యూపీలో త్వరలో జరుగనున్న ఉప ఎన్నికల్లో అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ముకుంద్ భాస్కర్‌ మణికి టిక్కెట్ ఇవ్వోద్దంటూ కాంగ్రెస్ నేత తారా యాదవ్ అడ్డు చెప్పడంతో సొంత పార్టీ నేతలే ఆమె పై దాడికి పాల్పడ్డారు.


కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి సచిన్ నాయక్ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఈ ఘటన జరిగింది. ముకుంద్ భాస్కర్ కి టిక్కెట్ ఇవ్వోద్దంటూ తార వ్యతిరేకించడంతో కార్యకర్తలు ఒక్కసారిగా ఆమెపై దాడిచేసి ఈడ్చిపడేశారు. దీనిపై పార్టీ నాయకురాలు యూపీ ఇంచార్జ్ ప్రియాంక గాంధీ కి ఫిర్యాదు చేశారు తారా.

Read more RELATED
Recommended to you

Latest news