తెలంగాణలో దారుణం.. ఉరేసుకుని కానిస్టేబుల్‌ సుసైడ్‌

-

శంషాబాద్ ఎయిర్ పోర్టు పిస్ పరిధిలోని జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో అశాయ్య అనే కానిస్టేబుల్ ప్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అశాయ్య చేవెళ్ల ఎక్సైజ్ కార్యాలయంలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. అయితే.. అశాయ్య ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఆర్థిక పరిస్థితుల కారణంగా మృతి చెందడా…అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. అశాయ్య స్వగ్రామం వికారాబాద్ జిల్లా ఎన్నికతల గ్రామం. నిన్న ఉదయం 10 గంటలకు డ్యూటీ కోసం శంషాబాద్ ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చాడు. ఇతను 24 గంటలు డ్యూటీ అయిపోవడంతో రిలీవర్ గణేష్ వచ్చి చూడగా ఫ్యాన్‌ కు ఉరి వేసుకుని ఉన్నాడు. ఇదే విషయమై ఉన్నతాధికారులకు తెలియజేయడంతో శంషాబాద్ పోలీసులు వచ్చి ఆత్మహత్య సంఘటన స్థలంలో ఉన్న ఆధారాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకుని… దర్యాప్తు చేస్తున్నారు శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌ పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news