హైదరాబాద్ లో విషాదం… లవర్ తో గొడవపడి కానిస్టేబుల్ ఆత్మహత్య !

-

హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. లవర్ తో గొడవపడి కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. సెల్ఫీ సూసైడ్ పాల్పడ్డాడు రాజు అనే కానిస్టేబుల్. ప్రేమించిన అమ్మాయి తో విభేదాలు రావడంతో తేజావాట్ రాజు అనే కానిస్టేబుల్ ఇవాళ ఆత్మహత్య చేసుకున్నాడు. నాచారం పీఎస్ పరిధిలోని సింగం చెరువు తండా లో రాజు నివసిస్తున్నాడు.

మహేశ్వరం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. కాని స్టేబుల్ రాజుకు బంధువుల అమ్మాయితో గత కొద్ది రోజులుగా ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు సమాచారం అందుతోంది.

గత కొద్ది రోజులుగా వీరి మధ్య విభేదాలు రావడంతో మనస్తాపం చెందిన రాజు నిన్న ఉదయం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఉదయం ఉరి వేసుకోని చనిపోవడం గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రాజు మృత దేహన్నీ గాంధీ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news