కర్నూలు మెడికల్‌ కాలేజీలో కరోనా కలకలం..15 మంది విద్యార్థులకు పాజిటివ్‌

-

కర్నూలు మెడికల్ కళాశాలలో కరోనా కలకలం రేపింది. కర్నూలు మెడికల్‌ కాలేజీలో ఏకంగా… 15 మంది వైద్య విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. నిన్న 50 మంది వైద్య విద్యార్థులకు కరోనా పరిక్షలు చేయగా.. అందులో 15 మంది వైద్య విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

ఎంబీబిఎస్ ఫస్టియర్ విద్యార్థులు 11 మంది, హౌస్ సర్జన్ లు నలుగురు కరోనా సోకిన వారిలో ఉన్నారు. మరో 40 మంది వైద్య విద్యార్థుల నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు వైద్య సిబ్బంది పంపింది. అటు కాలేజీ మొత్తం సానిటైజ్‌ చేస్తున్నారు అధికారులు. కాగా..ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 1257 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,81, 859 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో ఇద్దరూ చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 505 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4774 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news