భారత్‌లో 38,792 కొత్త కరోనా కేసులు, 624 మరణాలు..!

-

కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి.  కరోనా corona కేసులు కూడా ఇంకా వస్తూనే వున్నాయి. ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండడం చాలా ముఖ్యం. అందుకని ఇంకా జాగ్రత్తగా ఉండడం మంచిది. బయటకి వెళ్ళినప్పుడు మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం లాంటి కనీస జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

ఇక కరోనా వైరస్ కేసుల కోసం పూర్తి వివరాలలోకి వెళితే.. గత 24 గంటల్లో భారత్‌లో 38,792 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు తెలిపింది. మహమ్మారి ప్రారంభం నుండి కరోనా సోకిన వారిలో మంది రోగులు ఇప్పటికే COVID-19 నుండి 30104720 కోలుకున్నారు మరియు గత 24 గంటల్లో 41,000 మంది కోలుకున్నారు.

గత 24 గంటల్లో 624 మంది మృతి చెందారు. దీనితో మరణాలు సమాఖ్య 411408 గా వుంది. ఈ ఏడాది జనవరి 16 న భారత్‌ తన కోవిడ్ -19 టీకా డ్రైవ్‌ను స్టార్ట్ చెయ్యగా… మంగళవారం వరకు 38,14,67,646 వ్యాక్సిన్ మోతాదులను అందించారు. రాష్ట్రాలు లేదా యుటిలకు 39.46 కోట్ల వ్యాక్సిన్ మోతాదులను అందించారు.

ఇక గత 24 గంటల్లో వ్యాక్సిన్ మోతాదుల గురించి చూస్తే.. 37,14,441 మోతాదులను అందించారు. దీనితో మొత్తం 38,7,97,935 వ్యాక్సిన్ మోతాదులను అందించారు.

Read more RELATED
Recommended to you

Latest news