ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కరోనా కేసులు నేడు భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 441 కరోనా కేసులు నమోదైనట్లు హెల్త్ బులిటెన్లో వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 235, వికారాబాద్ 23, రంగారెడ్డి జిల్లాలో 183 కేసులు నమోదయ్యాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి, నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భారీగా కరోనా కేసులు
By Naga Babu
-
Previous article
Next article