దేశ రాజధానిలో మరణ మృదంగం…!

-

కరోనా వైరస్ కారణంగా దేశ రాజధాని ఢిల్లీ మరోసారి 100 మందికి పైగా మరణాలను నమోదు అయ్యాయి. ఢిల్లీలో శనివారం 5,879 కరోనావైరస్ కేసులు, 6,963 రికవరీలు నమోదయ్యాయి. శనివారం 111 కరోనావైరస్ మరణాలు సంభవించాయి అని అక్కడి ప్రభుత్వం చెప్పింది. ఇక మరణాల సంఖ్య 8,270 కు చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీ కరోనా కేసుల సంఖ్య శనివారం 5,23,117 కు చేరుకుంది.

ఇదిలావుండగా, ఢిల్లీ ప్రభుత్వం, కేంద్రం నడుపుతున్న ఆసుపత్రులలో గత ఐదు రోజుల్లో 411 ఐసియు పడకలు చేర్చారు. ప్రైవేట్ ఆసుపత్రులలో 80% ఐసియు పడకలను కోవిడ్ -19 రోగులకు రిజర్వేషన్ చేస్తున్నట్లు ఆప్ ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అక్టోబర్ 28 నుండి కరోనావైరస్ కేసులు అక్కడ భారీగా పెరుగుతున్నాయి. మరణాలు దారుణంగా ఉన్నాయని సిఎం కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news