దేవుళ్లపై కరోనా ఎఫెక్ట్.. భారీగా పడిపోయిన శ్రీవారి ఆదాయం

-

హైదరాబాద్/తిరుపతి: కరోనా మహమ్మారి దేవుళ్ల ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కరోనా భయం, కఠిన నిబంధనలతో భక్తులు ఆలయాలకు వెళ్లడంలేదు. దేవుళ్లను దర్శించేందుకు ఆసక్తి చూపడంలేదు. దీని వల్ల ఆలయాల ఆదాయం భారీగా పడిపోయింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. దీని వల్ల తిరుపతి, విజయవాడ, యాదాద్రితో పాటు హైదరాబాద్‌లోని ఆలయాల ఆదాయానికి భారీగా గండిపడింది.

అటు తిరుమల శ్రీవారి ఆలయం ఆదాయం భారీగా పడిపోయింది. కోట్లలో నుంచి లక్షల్లో ఆదాయం తగ్గింది. కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయడంతో శ్రీవారి ఆలయానికి గత నెల రోజులుగా భక్తుల రద్దీ తగ్గింది. దీంతో ఆదాయం పడిపోయింది. తాజాగా రూ. 39 లక్షలు మాత్రమే రావడం గమనార్హం.

మరోవైపు తెలంగాణలో కూడా ఆలయాల ఆదాయం భారీగా తగ్గింది. కోవిడ్ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తుండటంతో ఆలయాలకు వచ్చే భక్తులు తగ్గిపోయారు. బుధవారం నుంచి 10 రోజుల పాటు లాక్ డౌన్ విధించనున్నారు. యాదగిరిగుట్టలో 10 రోజుల పాటు మధ్యాహ్నం 2 గంటల నుంచి లాక్ డౌన్ అమలు చేయనున్నారు. దీంతో అక్కడ షాపుల మూసివేతకు షాప్ ఓనర్ల నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఇళ్ల నుంచి బయటకు రావొద్దని యాదాద్రి భువనగిరి మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధ సూచించారు. అత్యవసర, నిత్యావసర సేవలకు మినహాయింపు ఇచ్చారు.

ఇదిలా ఉంటే హైదరాబాద్‌లోని ప్రధాన ఆలయాల్లో కూడా కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నారు. బల్కంపేట ఎల్లమ్మ, జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయాలు మూసివేయనున్నారు. దీంతో ఈ రెండు ఆలయాల ఆదాయం కూడా పడిపోతుందని అధికారులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news