పరోటా కోసం గోడలు దూకిన కరోనా పేషేంట్..!

-

తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా ఆసారిపళ్లంలో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో కరోనా సోకిన సుమారు 150 మందికి చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం ఆ పాఠశాలలో ఉన్న ఒక అతను గోడ ఎక్కిదూకి సమీపంలో ఉన్న దుకాణంలో పరోటా కొనుక్కుని వచ్చినట్లు తెలిసింది. అయితే కరోనా వార్డ్ లో చికిత్స పొందుతున్న ఓ కరోనా పేషంట్ పరోటా కోసం బయటకి వచ్చాడు. సమాచారం అందుకున్న స్థానికులు శుక్రవారం రాత్రి హఠాత్తుగా ఆందోళనకు దిగారు.

వారిని పోలీసులు సమాధాన పరిచి పంపారు. అతను పాఠశాల కాంపౌండ్‌ గోడ ఎక్కి అక్కడ ఉన్న సుమారు నాలుగు ఇళ్లలోని కాపౌండ్లలో చొరబడి బయటకు వచినట్టు తెలుస్తోంది. సుమారు మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో మెయిన్‌ రోడ్‌లో ఉన్న ఓ ప్రైవేటు దుకాణంలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో నమోదయినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news