తెలంగాణలో ఒమిక్రాన్ టెర్రర్.. విదేశాల నుంచి వచ్చిన 13 మందికి కరోనా పాజిటివ్

-

దక్షిణాఫ్రికా దేశంలో పుట్టిన ఒమీక్రాన్ అనే కరోనా కొత్త వేరియంట్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ కొత్త వేరియంట్ ఇప్పటికే 25 దేశాలకు వ్యాప్తి చెందిందని నిపుణులు గుర్తించారు. దీంతో ప్రపంచ దేశాలన్నీ అలర్ట్ అయ్యాయి. ముఖ్యంగా విదేశాల నుంచి తమ దేశాలకు వచ్చే వారి పట్ల ఆయా దేశాలు అప్రమత్తంగా ఉన్నాయి.

అయితే ఈ నేపథ్యం లో నే… తెలంగాణ రాష్ట్రం లోనూ.. ఈ ఒమిక్రాన్ వేరియంట్ టెర్రర్ మొదలైంది. దీంతో విదేశాల నుంచి తెలంగాణ కు వచ్చే వారికి.. కరోనా పరీక్షలు చేస్తున్నారు అధికారులు. కరోనా లక్షణాలు ఉంటే.. హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రికి వారిని తరలిస్తున్నారు అధికారులు. అయితే  తాజాగా టిమ్స్ ఆసుపత్రిలో ఉన్న 13 మంది కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వీరంతా ఇటీవల విదేశాల నుంచి హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన వారే కావడం విశేషం. దీంతో వారికి ఒమిక్రాన్ పరీక్షలు చేస్తున్నారు అధికారులు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news