మాజీ సీఎం కి కరోనా..!

-

దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. సామాన్యులు సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అందరిపై పంజా విసురుతున్న మహమ్మారి వైరస్ అందరిని ఆసుపత్రి పాలు చేస్తుంది. అయితే ప్రజలకు ధైర్యం చెప్పి అవగాహన కల్పించే ప్రజాప్రతినిధులు సైతం కరోనా వైరస్ బారిన పడుతుండడం ప్రజలందరిలో మరింత ఆందోళన పెంచుతుంది. ఇప్పటికే ఎంతో మంది ప్రజాప్రతినిధులు కరోనా వైరస్ పడిన విషయం తెలిసిందే. ఇటీవలే మరో మాజీ ముఖ్యమంత్రి కరోనా వైరస్ బారిన పడ్డారు.

గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఏళ్ల కేశుభాయ్ పటేల్ (92) ఇటీవలే కరోనా వైరస్ బారిన పడ్డారు. గత కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రాపిడ్ ఆంటీ టెస్టులు చేయించుకున్నారు. టెస్టుల్లో ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అయినప్పటికీ పూర్తిస్థాయి నిర్ధారణ కోసం ఆర్ టి పి సి ఆర్ టెస్ట్ కోసం శాంపిల్స్ పంపారు కేశుభాయ్ పటేల్. ఆయనకు కరోనా కు సంబంధించిన ఎలాంటి లక్షణాలు లేవు అంటూ కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా కేశు బాయ్ గతంలో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. ఆయన వయసు కూడా ఎక్కువ కావడంతో ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news