సూపర్ స్టార్ మహేశ్ హీరోయిన్‌కి కరోనా పాజిటివ్..!

-

దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారికి ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. ఇక సామాన్య ప్రజల నుండి సెలెబ్రెటీల వరకు ఎవరిని వదలడం లేదు ఈ వైరస్. ఈ మహమ్మారి కారణంగా చాల సెలబ్రెటీలు చనిపోయారు. మరికొంత మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా మరో హీరోయిన్ కృతిసనన్ కి కరోనా వైరస్ సోకింది.

kruthi san
kruthi san

సూపర్‌ స్టార్ మహేశ్‌బాబు ‘వన్ నేనొక్కడినే’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన కృతిసనన్ అందరికి గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత ఒకటి, రెండు తెలుగు సినిమాల్లో నటించినా అంతగా గుర్తింపు రాకపోవడంతో బాలీవుడ్‌కి మకాం మార్చింది ఈ అమ్మడు. వన్ సినిమాలో తన అందచందాలతో కుర్రకారును హుషారెత్తించిన ఈ భామ ప్రస్తుతం కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించింది.

ప్రస్తుతం కృతిసనన్ ప్రస్తుతం లుక్కా చుప్పి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ చండీగఢ్‌ లో కొనసాగుతుండగా వారం రోజుల క్రితం షూటింగ్ ముగించుకొని ఇంటికి వచ్చేశారు. అయితే ఆరోగ్యం నలతగా ఉండటం గమనించిన కృతి అనుమానం వచ్చి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకుంది. దీంతో కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇక ఈ విషయాన్ని తనే ప్రముఖ సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించింది.

ఇక ప్రస్తుతం ఆమె ముంబైలోని తన నివాసంలో హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్నారు. అయితే ఈ మధ్య తనను కలిసిన వాళ్లు, బంధువులు, స్నేహితులు అందరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. ఇదిలా ఉంటే ప్రభాస్ హీరోగా పాన్‌ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్‌’ లో కృతిసనన్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆమె సీత పాత్రలో నటించనున్నారు. ఈ సినిమా షూటింగ్‌ జనవరిలో ప్రారంభమవుతుందని చిత్ర యూనిట్ ఇటీవల ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news