పురుషులకు కరోనా షాకింగ్ న్యూస్…!

-

కరోనా వైరస్ దెబ్బ ఇప్పుడు చిన్న పెద్ద పేద ధనిక అనే తేడా లేకుండా జనాలకు గట్టిగానే తగులుతుంది అనేది అర్ధమవుతుంది. లక్షల మంది ప్రజలు దీని బారిన పడటం మరణించడం అనేది జరుగుతుంది. కొంత మందికి అది వచ్చినా సరే ప్రాణాలతో బయటపడే పరిస్థితి ఉంటుంది. ఈ తరుణంలో వైరస్ కారణంగా ఎవరు ఎక్కువగా మరణించే అవకాశం ఉంది అనే దాని మీద ఒక సర్వే చేసారు.

ఊబకాయం ఉన్నవారికి వైరస్‌ సోకితే మరణించే ముప్పు ఎక్కువగా ఉంటుంది అని, పురుషులకు ఈ ముప్పు చాలా ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. చైనాలో వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని అక్కడ ఊబకాయం తో ఉన్న వారే ఎక్కువగా మరణించారు అని అన్నారు. కరోనా వైరస్‌ కారణంగా గర్భవతులు, వయసు పైబడిన వారు, కరోనా రాక ముందు ఇతర రోగాలతో బాధపడే వారు మరణించే అవకాశం ఉందని అన్నారు.

అదే విధంగా ఈ వైరస్ బారిన మహిళలకన్నా పురుషులే పడటానికి అధిక అవకాశాలు ఉన్నాయని పలువురు వెల్లడించారు. లండన్ లో నిర్వహించిన ఈ సర్వే లో ఊబకాయం కలిగిన పురుషులు మరణించడానికి అధిక అవకాశం ఉందని గుర్తించారు. ఈ అధ్యయనాన్ని 166 ఆస్పత్రుల్లోని 16,749 మందిపై నిర్వహించారు పరిశోధకులు. వారిలో ఊబకాయం ఎక్కువగా ఉన్న వారు మరణించారు అని తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news