రాష్ట్రంలో స్వల్పంగా పెరిగిన కరోనా… నేడు 385 కేసులు

-

తెలంగాణ‌లో కరోనా కేసుల సంఖ్య నిన్న‌, మొన్న‌ స్థిరంగా కొన‌సాగిన‌ప్ప‌టికీ ఇవాళ మాత్రం స్వ‌ల్పంగా కేసులు పెరిగాయి. తెలంగాణ‌లో నూత‌నంగా 385 కేసులు న‌మోదు కాగా.. క‌రోనా నుంచి మ‌రొక 733 మంది బాధితులు తాజాగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్ర‌స్తుతం 4787 క‌రోనా యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇవాళ 39386 మందికి అధికారులు క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఇప్ప‌టివ‌ర‌కు 8,95272 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.

మ‌రొక వైపు భార‌త్‌లో 20 రోజుల నుంచి క‌రోనా కేసులు విప‌రీతంగా త‌గ్గుతున్నాయి. దేశంలో 16,051 కేసులు న‌మోదు అయ్యాయి. దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసులు కాస్త త‌గ్గు ముఖం ప‌డుతున్న త‌రుణంతో తెలంగాణలో ఇవాళ స్వ‌ల్పంగా కేసులు పెర‌గం గ‌మ‌నార్హం.

Read more RELATED
Recommended to you

Latest news