కరోనా కలకలం.. భారత్ లో రికార్డు స్థాయిలో కేసులు..!

-

భారత్ లో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ప్రజలకూ, ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఏరోజుకారోజు నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ మహమ్మారి దెబ్బకు ఇప్పటికే ఎంతో మంది మరణించారు. అయినా ఇది మాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. పరీక్షలు పెంచే కొద్ది కేసులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. ఇండియాలో గత 24 గంటల్లో కొత్తగా 1,9459 మందికి కరోనా సోకగా, మొత్తం 380 మంది చనిపోయారు.

దీంతో ఇండియాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5,48,318కి పెరిగింది. మొత్తం మరణాల సంఖ్య 16,475కు చేరుకుంది. అలాగే గత 24 గంటల్లో ఇండియాలో 12,010 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు ఇండియాలో కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,21,722కి చేరుకోగా.. ప్రస్తుతం 2,10,120 యాక్టివ్ కేసులున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news