ఏపీలో కరోనా విజృంభణ.. ఒక్కరోజులోనే..!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్‌ కేసులతో పాటు మరణాలు కూడా ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. దీని ధాటికి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పరీక్షల సంఖ్య పెరుగుతున్న కొద్దీ కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో మాస్క్ లేనిదే బయట అడుగుపెట్టలేకపోతున్నారు మనుషులు. అధికారులు ఈ మహమ్మరిని అరికట్టేందుకు అన్నీ చర్యలు తీసుకుంటున్నారు.

అయినా దీని తీవ్రత మాత్రం తగ్గట్లేదు. కాగా, ఏపీలో గత 24 గంటల్లో 30,216 శాంపిళ్లను పరీక్షించగా మరో 706 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలాగే మరో 302 మంది కరోనా నుంచి కోలుకోగా మరో 11 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 13,891కి చేరుకుంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 7,479 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 6,232 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 180కి చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news